Add parallel Print Page Options

దావీదు తుది పలుకులు

23 ఇవి దావీదు చివరి మాటలు,

“యాకోబు దేవునిచే అభిషిక్తము చేయబడిన రాజు,
    ఇశ్రాయేలు మధుర గాయకుడు,
యెష్షయి కుమారుడు అయిన దావీదు పలికిన సందేశం.
    దావీదు ఇలా అన్నాడు:
యెహోవా ఆత్మ నా ద్వారా మాట్లాడినది.
    ఆయన పలుకే నా నోటిలో వున్నది.
ఇశ్రాయేలు దేవుడు మాట్లాడాడు,
    ఇశ్రాయేలుకు, ఆశ్రయదుర్గమైన దేవుడు నాతో యిలా అన్నాడు:
‘ఏ వ్యక్తి ప్రజలను న్యాయమార్గాన పరిపాలిస్తాడో,
    ఏ వ్యక్తి దైవ భీతితో పరిపాలన సాగిస్తాడో
ఆ వ్యక్తి అరుణోదయ కాంతిలా ప్రకాశిస్తాడు,
    ఆ వ్యక్తి మబ్బులేని ప్రాతఃకాలంలా ప్రశాంతంగా వుంటాడు,
లేతగడ్డిని చిగురింపజేయు వర్షానంతర సూర్యకాంతిలా
    ఆ వ్యక్తి ప్రకాశిస్తాడు.’

“గతంలో దేవుడు నా కుటుంబాన్ని బలపర్చలేదు.
    తరువాత దేవుడు నాతో ఒక శాశ్వత ఒడంబడిక చేశాడు.
అది సమగ్రమైన నిబంధనగా దేవుడు రూపొందించాడు.
    ఈ ఒడంబడికను దేవుడు బలపర్చాడు.
దానిని ఆయన ఉల్లంఘించడు!
    ఈ ఒడంబడిక నాకు మోక్ష సాధనం; నేను కోరినదల్లా ఈ ఒడంబడికనే; ఖచ్చితంగా యెహోవా దానిని వర్ధిల్లేలాగు చేస్తాడు!

“కాని దుష్టులు ముండ్లవంటి వారు.
    జనులు ముండ్లనుచేతబట్టరు.
    వాటిని తక్షణం విసర్జిస్తారు!
వాటిని ఎవరు తాకినా కర్ర,
    ఇనుము బల్లెములతో గుచ్చివేసినట్లవుతుంది.
దుష్టులు కూడ ముండ్ల వంటి
    వారు వారు అగ్నిలో తోయబడి
    పూర్తిగా దహింపబడతారు.”

Read full chapter